తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వరావుపేట,మణుగూరు మరియు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో నమోదైన మర్డర్ కేసుల్లోని నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు కోర్టు డ్యూటీ అధికారులను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా లోక్ అదాలత్ ద్వారా అత్యధికంగా కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరిచిన చుంచుపల్లి మరియు సుజాత నగర్ కోర్టు డ్యూటీ అధికారులను కూడా ఈ సందర్భంగా అభినందించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవిడి లక్ష్మీ,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసీక్యూటర్స్ లావణ్య, విశ్వశాంతి,రాజారావు, మణుగూరు కోర్టు డ్యూటీ అధికారి అశోక్, కొత్తగూడెం 3టౌన్ కోర్ట్ డ్యూటీ అధికారి హేమీలాల్ మరియు అశ్వారావుపేట కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ నాగేశ్వరరావు లను మర్డర్ కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసినందులకు గాను మరియు సుజాతనగర్ కోర్ట్ డ్యూటీ అధికారి మోహన్, కొత్తగూడెం 3టౌన్ పిఎస్ JFCM కోర్ట్ డ్యూటీ అధికారి శోభన్ లను ఇటీవల లోక్ అధాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేసినందుకు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, 3టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై రాఘవ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ