Friday, 19 June 2026 01:53:27 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Date : 11 June 2026 12:59 PM Views : 333

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున 12.30 గంటల నుండి 5.00 గంటల వరకు భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమానిత వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల ధ్యేయంగా సోదాలు చేపట్టామని డిఎస్పి అరుణ్ కుమార్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని మొత్తం 62 లాడ్జిలతో పాటు స్థానిక బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఫింగర్ ప్రింట్ డివైస్లులు, డాగ్ స్క్వాడ్ బృందాలతో లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో లాడ్జిల్లా యజమానులు, మేనేజర్లు, సిబ్బంది యొక్క పూర్తి వివరాలు సేకరించి, లాడ్జిలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ కనీసం 2 నెలల పాటు బ్యాకప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, లాడ్జి వెలుపల రహదారిపై వచ్చి పోయే వాహనాల కదలికలను స్పష్టంగా రికార్డు అయ్యేలా కెమెరాలను రోడ్డు వైపు అమర్చాలని ఆదేశించారు. పట్టణ ప్రజల భద్రత దృష్ట్య ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించినట్లయితే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :