Monday, 03 August 2026 04:30:00 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Date : 11 June 2026 12:59 PM Views : 370

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున 12.30 గంటల నుండి 5.00 గంటల వరకు భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమానిత వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల ధ్యేయంగా సోదాలు చేపట్టామని డిఎస్పి అరుణ్ కుమార్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని మొత్తం 62 లాడ్జిలతో పాటు స్థానిక బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఫింగర్ ప్రింట్ డివైస్లులు, డాగ్ స్క్వాడ్ బృందాలతో లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో లాడ్జిల్లా యజమానులు, మేనేజర్లు, సిబ్బంది యొక్క పూర్తి వివరాలు సేకరించి, లాడ్జిలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ కనీసం 2 నెలల పాటు బ్యాకప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, లాడ్జి వెలుపల రహదారిపై వచ్చి పోయే వాహనాల కదలికలను స్పష్టంగా రికార్డు అయ్యేలా కెమెరాలను రోడ్డు వైపు అమర్చాలని ఆదేశించారు. పట్టణ ప్రజల భద్రత దృష్ట్య ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించినట్లయితే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :