తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున 12.30 గంటల నుండి 5.00 గంటల వరకు భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమానిత వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల ధ్యేయంగా సోదాలు చేపట్టామని డిఎస్పి అరుణ్ కుమార్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని మొత్తం 62 లాడ్జిలతో పాటు స్థానిక బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఫింగర్ ప్రింట్ డివైస్లులు, డాగ్ స్క్వాడ్ బృందాలతో లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో లాడ్జిల్లా యజమానులు, మేనేజర్లు, సిబ్బంది యొక్క పూర్తి వివరాలు సేకరించి, లాడ్జిలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ కనీసం 2 నెలల పాటు బ్యాకప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, లాడ్జి వెలుపల రహదారిపై వచ్చి పోయే వాహనాల కదలికలను స్పష్టంగా రికార్డు అయ్యేలా కెమెరాలను రోడ్డు వైపు అమర్చాలని ఆదేశించారు. పట్టణ ప్రజల భద్రత దృష్ట్య ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించినట్లయితే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ