తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు స్థానిక ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూలూరుపాడు మండల అభివృద్ధి అధికారి పూరేటి అజయ్ , మండల విద్యాశాఖ అధికారి బి. జుంకీలాల్ , జూలూరుపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పెట లక్ష్మీ నరసయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ బాలబాలికలు వారి తల్లిదండ్రులు హాజరవడం జరిగింది. తల్లిదండ్రులకి అవగాహన కార్యక్రమం నిర్వహించి అనంతరం అందరి అతిథులు యొక్క ప్రసంగాలు కొనసాగాయి. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి శ్రీ పూరేటి అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫునుండి ఎటువంటి ఆటంకాలు లేకుండా సకాలంలో దివ్యాంగులకు అన్ని రకాల పనులు చేసి పెట్టేందుకు వ్యవస్థ సిద్ధంగా ఉందని ఎవరూ అధైర్య పడద్దని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.అనంతరం స్థానిక మండల విద్యాశాఖ అధికారి బి. జుంకీలాల్ మాట్లాడుతూ దివ్యాంగులు వారి యొక్క విద్య అభ్యాసం వంటి విషయాలలో ప్రభుత్వం ఎన్నో మంచి సౌకర్యాలు కల్పించిందని దివ్యాంగ బాలబాలికల యొక్క తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహ పడకుండా పిల్లల యొక్క సంపూర్ణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ SA మరియు మాచినపేట పాఠశాలలో మరొక స్పెషల్ ఎడ్యుకేటర్ SGT, అలాగే మండలంలో ఇద్దరు ఐఆర్పీలు అందరూ కూడా ఈ పిల్లల యొక్క సకల అవసరాలను తీర్చడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వక్తగా వ్యవహరించినటువంటి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ జి. నాగ రమేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు పిల్లలకు ఎటువంటి సౌకర్యాలు విద్యాశాఖ నుండి కల్పించబడ్డాయో వివరించారు. అలాగే వారానికి రెండు రోజులు అనగా సోమవారం మరియు బుధవారం ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు స్థానిక జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతుంది దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మండలంలోని దివ్యాంగ బాలబాలికల యొక్క గుర్తింపు మరియు వారి యొక్క అవసరాలు తీర్చడం వారికి సకాలంలో సమాచారం అందించి సదరం సర్టిఫికెట్లు మరియు సహాయ ఉపకరణాలు పొందే విధంగా కృషి చేసినటువంటి మండల ఐఇఆర్పిలు సాంబశివరావు మరియు శ్రీనివాస్, ఇద్దరినీ కూడా విద్యాశాఖ అధికారి అభినందించారు.అనంతరం కార్యక్రమానికి హాజరైనటువంటి దివ్యాంగ బాలబాలికలు అందరికీ అండర్ 14 అండర్ 17 అనే విభాగాలుగా రన్నింగ్, మ్యూజికల్ చైర్, క్యారమ్స్, చెస్ లాంటి ఆత్మస్థైర్యాన్ని నింపే అనేక ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటలలో పాల్గొన్న దివ్యాంగ బాలబాలికలు అందరికీ బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. అనంతరం కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారిలో స్థానిక ప్రజలు, దివ్యాంగ బాలబాలికలు వారి తల్లిదండ్రులు, ఉన్నత అధికారులు, జూలూరుపాడు ఉన్నత పాఠశాల సిబ్బంది మరియు ఉపాధ్యాయులు, ఫిజియోథెరపిస్ట్ మేడం శ్రీజ అలాగే పాఠశాలలో విద్యనుభ్యసిస్తున్న దివ్యాంగ బాలబాలికలు కూడా ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ