తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.తిరుమలాయపాలెం: పాలేరు నియోజకవర్గం,తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల సమావేశం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా *పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు,ERO రవికుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ, ఇప్పటివరకు చేసింది ఒక లెక్క, ఈ మూడు రోజులు చేసేది ఒక లెక్క అని, ఎలక్షన్ కమిషన్ ద్వారా "అన్ కలెక్టబుల్" లేదా ఏ ఎస్ డి డి ( ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ) లిస్ట్ అని అందులో మన బీఏలను సంతకం చేయమని కోరుతున్నారు. అలాంటి ఫార్మాట్ పైన ఎట్టి పరిస్థితుల్లో సంతకం చెయ్యొద్దని,బిఎల్ఏలు సంతకం చేస్తే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆ ఓటర్లని తొలగించడం జరుగుతున్నది. కావున దయచేసి ఏ బిఎల్ఏ కూడా పార్టీ నాయకులకు చెప్పకుండా దానిపైన సంతకం చెయ్యొద్దని చెప్పారు. BLAలు ప్రతి ఇంటికి తిరిగి సరైన రిపోర్ట్ అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో BLA సూపర్ వైజర్లు, BLAలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు అనిల్ రెడ్డి, బాణోత్ సుజాత, అనిల్ కుమార్, నరేందర్ రెడ్డి, చిమ్లా, నాయకులు నజీర్, జాలె కిరణ్, రమేష్, నాగరాజు, మల్సూర్, ఉన్నం రాజశేఖర్, షేక్ కరీం, నల్లబెల్లి లింగన్న, సయ్యద్ మదర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ