తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి.సింగరేణి నూతన అధికారులను కలిసి సన్మానించిన కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ నాయకులు.సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆధ్వర్యంలో నాయకులు జీఎం పర్సనల్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిరణ్కుమార్, జీఎం అజయ్కుమార్, జీఎం ఎడ్యుకేషన్ గడిపెల్లి రాజేంద్రప్రసాద్లను కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు యాజమాన్యం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కొత్తగూడెం ఏరియాలో కార్మికులకు సంబంధించిన పలు సమస్యలు వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్నాయని, వాటిని వేగంగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందని నాయకులు పేర్కొన్నారు.కార్మికులకు న్యాయం జరిగేలా యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరిస్తే సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు కార్మికుల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ అంశాలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జె. గట్టయ్య, భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపాలకుల రమేష్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,సత్తుపల్లి కార్యదర్శి సముద్రాల సుధాకర్ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు కత్తెర్ల రాములు, ఆఫీస్ బేరర్లు సందేబోయిన శ్రీనివాస్, ఎస్. నాగేశ్వరరావు, గుమ్మడి వీరయ్య, హీరాలాల్, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, ఎం.ఆర్.కె. ప్రసాద్, సురేందర్, నాయకులు మెంగన్ రవి రాజకుమార్,భరణి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ