తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం క్లబ్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అధ్యక్షతన జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఎమ్మెల్యే సూరవరం చిత్రపటానికి నివాళులార్పించారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతూ రెండు సార్లు ఎంపీగా విజయం సాధించినా సురవరం నిరాడంబరమైన జీవితాన్ని గడిపారన్నారు. ధనిక కుటుంబంలో జన్మించిన సురవరం పేదల పక్షాన నిలిచిన వామపక్ష యోధుడని, ఆయన జీవన శైలి సురవరం ఎంతో ఆదర్శమని, విద్యార్థి దశ నుంచే సురవరం సుధాకర్రెడ్డి ఉద్యమ బాట పట్టారన్నారు. అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, మాలోత్ రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య లతో పాటుగా పలు పార్టీల నాయకులు, కొత్తగూడెం పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ