Monday, 03 August 2026 03:34:03 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

Date : 24 July 2026 06:19 PM Views : 96

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పంటల వైవిధ్యీకరణతో రైతులకు భరోసా కల్పించాలి. ఎంఎస్పీపై అపోహలు తొలగించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి.జిల్లాల్లో అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలి.రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు.శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. గత కొన్ని రోజులుగా భారత వాతావరణ శాఖ అంచనాలు నిజమవుతున్నాయని, ప్రస్తుత పరిస్థితులు త్వరలో మెరుగుపడే అవకాశాలు తక్కువగా ఉన్నందున అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా అవగాహన కల్పించాలని సూచించారు.కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రైతుల్లో ఉన్న అపోహలను పూర్తిగా తొలగించాలని, దేశవ్యాప్తంగా దాదాపు 20 పంటలకు ఎంఎస్పీ అమలులో ఉందని వివరించాలని పేర్కొన్నారు. కేవలం వరికే మద్దతు ధర ఉంటుందనే భావన సరైంది కాదని, పత్తి సహా అనేక పంటలకు ఎంఎస్పీ వర్తిస్తుందని తెలిపారు. మార్కెట్ ధర ఎంఎస్పీ కంటే తగ్గినప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు స్పష్టంగా తెలియజేసి ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల రైతుల ఆదాయం తగ్గుతుందనే అభిప్రాయం సరికాదని, అనేక సందర్భాల్లో మరింత అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రాంతానికి అనువైన పంటల సాగుపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని, సాగు విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు.ప్రతి జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి వెంటనే అమలు చేయాలని, అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే రిజర్వాయర్లలో నీటి నిల్వలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.జిల్లా ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ఎలాంటి అపోహలు లేకుండా స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మిషన్ భగీరథ ఈఈ నలిని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :