తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.... *జూలూరుపాడు మండలం మాచినపేట గ్రామానికి చెందిన బి.ప్రవీణ్ అమ్మానాన్నను చిన్నప్పుడే చనిపోయినందున ఇంటర్ వరకు చదువుకున్న తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అట్టి దరఖాస్తును పరిశీలించి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కు ఎండార్స్ చేశారు.... *రుద్రంపూర్ కు చెందిన జోగు చంద్రావతి వికే -7 వల్ల తమ ఇల్లు కూల్చివేశారని, 100 గజాల స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ హౌసింగ్ శాఖకు ఎండార్స్ చేశారు... *పాల్వంచ నవభారత్ పాఠశాల, గాంధీ నగర్ ఏరియా చెందిన విద్యార్థులు స్థానికులు తమ ఏరియాలో కోతులు బెడద అధికంగా ఉందని వీటి విషయంలో, తాము ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రం అందజేయగా దరఖాస్తును పరిశీలించి సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు.... *చర్ల మండలం ఎర్రంపాడు, కిష్టారాంపాడు, బూరుగుపాడు గ్రామాలకు చెందిన మూల ఆదివాసీలు కొందరు రాజ్యాంగ పరంగా ఇస్తున్న ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు తమకు నిలిపివేశారని, అన్యాయం జరుగుతుందని హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు తమకు కోయ కుల ధ్రువీకరణ పత్రాలు పునరుద్ధరించాలని కలెక్టర్ కోరగా సంబంధిత శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు... *చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ఎస్ఆర్ టి ఏరియా కు చెందిన పూసల రఘు వికే-7 మైన్ వల్ల తమ ఇళ్లను అధికారులు కూల్చివేశారని,గంగా హుస్సేన్ బస్తీలో 100 గజాల స్థలాన్ని కేటాయించారని అందుకు సంబంధించి తమకు ఇల్లు కట్టుకోలేము కాబట్టి ఐదు లక్షల ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పించాలని కలెక్టర్ ను కోరారు. సంబంధిత దరఖాస్తును పరిశీలించి కలెక్టర్ హౌసింగ్ శాఖకు ఎండార్స్ చేశారు... ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీఓ విద్యా చందన,వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు....
Admin
తెలుగు వెలుగు టీవీ