Thursday, 17 September 2026 09:37:10 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

టేకులపల్లి, ప్రభుత్వ బడిలో చదివి మెరిసిన నందినీ – 507 మార్కులతో ప్రతిభకు నిదర్శనం.

Date : 29 April 2026 07:34 PM Views : 376

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంచితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని టేకులపల్లి మండలము బేతంపూడి పంచాయతీ వెంకట్యా తండ కు చెందిన బాణోత్ నందినీ మరోసారి నిరూపించింది. స్థానిక ZPHS టేకులపల్లిలో చదువుతున్న నందినీ పదవ తరగతి పరీక్షల్లో 507 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.MPPS వాగొడ్డు తండకు చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మా కుమార్తె అయిన నందినీ, మొదటి నుంచీ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ ఈ విజయాన్ని సాధించడం విశేషంగా నిలిచింది. పరిమిత వనరుల మధ్యనైనా కృషి, పట్టుదల ఉంటే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఆమె రుజువు చేసింది.నందినీ ప్రతిభపై పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆమె క్రమశిక్షణ, కష్టపడే తత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు. గ్రామస్తులు, స్నేహితులు నందినీని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నందినీ తల్లిదండ్రులు మాట్లాడుతూ,“మేము ప్రభుత్వ బడులపైనే నమ్మకం పెట్టుకున్నాం. మా కూతురు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయి మార్కులు సాధించడం మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఈ ఫలితం రావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, ప్రభుత్వ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని నందినీ విజయంతో మరోసారి స్పష్టమైంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అందుతున్న వసతులు, నాణ్యమైన విద్య మరియు ఇంగ్లీషు మీడియం భోధన ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ లోనే చవించాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని , నాణ్యమైన భోధన బోధించే ఉపాద్యాయులు ఉన్నారని , ఆమె సాధించిన ఈ ఫలితం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :