తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 10 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు నున్న మహేష్, పల్లపు తిరుపతిరావులు బిల్లు లేకుండా గుంటూరు నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చిన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్న క్రమంలో జూలూరుపాడు ఏవో దీపక్ నంద్ కు నమ్మదగిన సమాచారం మేరకు కాకర్ల క్లస్టర్ పరిధి ఏ ఈ ఓ ప్రసాద్ రావు, హెడ్ కానిస్టేబుల్ కే వెంకటరత్నం, కానిస్టేబుల్ జి వెంకటేశ్వరరావు ఒక టీం గా ఏర్పడి అనంతారం గ్రామంలో తనకి నిర్వహిస్తున్న క్రమంలో పాలెపు శివకృష్ణ ఇంటిదగ్గర వారిని గమనించిన పిదప వెంటనే ఇద్దరు పంచులను సూరారం కార్యదర్శి హరిబాబు, చెంబుని గూడెం కార్యదర్శి సతీష్ కార్యదర్శులచే పంచనామా నిర్వహించారు. పంచులలో మొదటి వ్యక్తి నున్న మహేష్(32) రెండవ వ్యక్తి పల్లపు తిరుపతిరావు (42) వద్దనుండి 115 విత్తన ప్యాకెట్లను, హుండాయ్ క్రెటా కారు, 13000 క్యాష్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకొని వీరిపై సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1983 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి ist addi jecm ఎదుట హాజరు పరిచారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియా సమావేశంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిని చాకేచక్యంగా పట్టుకున్న ఏవో దీపక్ ఆనంద్, సీఐ ఇంద్రసేనారెడ్డి ఎస్సై రవి మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ