Sunday, 02 August 2026 06:30:34 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్లకు జీతాలు ఇవ్వాలి.. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 18 October 2024 06:04 PM Views : 444

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్లకు జీతాలు ఇవ్వాలి.. ఈనెల 22న స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ల సమస్యలపై దీక్ష .. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్. పాల్వంచ మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్లకు మున్సిపాలిటీ ద్వారా జీతాలు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ స్వచ్చ భారత్ డ్రైవర్లు హెల్పెర్ల తో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ జీతేష్.వి.పాటిల్ కు వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్ల జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని,అన్ని మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ ద్వారా జీతాలు చెల్లిస్తూ పాల్వంచలో మాత్రం ఇంటింటికీ నెలకు రూ.50 వసూలు చేసుకొని డబ్బులు తీసుకోమనగా చాలా మంది ఇంటి యజమానులు డబ్బులు ఇవ్వక కొంతమంది ఇచ్చిన వారి కనీస అవసరాలకు సరిపోవడం లేదని,కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.స్వచ్చ భారత్ డ్రైవర్లు,హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కాకటి హుస్సేన్,రాయల పార్వతి,బత్తుల వెంకటేశ్వరమ్మ,దేవాళ్ళ రమణ,వేముల రమణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :