Thursday, 14 May 2026 01:01:49 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

కొత్తగూడెం ఏరియా గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో జిఎం కార్యాలయం ఎదుట భారీఎత్తున ధర్నా,ముట్టడి

Date : 08 November 2025 06:17 PM Views : 731

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని స్పష్టం- మిరియాల రంగయ్యా.శనివారం సాయంత్రం కొత్తగూడెం ఏరియా లో జిఎం కార్యాలయం ఎదుట భారీఎత్తున ధర్నా, ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో జిఎంకి మెమొరాండం అందచేశారు,అనంతరం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్యా, మాట్లాడుతూ కమిటీల పేరుతో యాజమాన్యం కాలయాపన చేయవద్దని విజ్ఞప్తి చేశారు,ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆరు నెలల నుంచి నిర్వహించకపోవడం వలన కార్మికులు అనారోగ్య కారణాల వలన ఉద్యోగం చేయలేక పోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు, సొంత ఇంటి పథకం,మారుపేర్ల సమస్య, పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ కోలిండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలని,అలాగే డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని, సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా విడుదలచేసిన 150 మస్టర్ల సర్క్యులర్ నీ వెంటనే రద్దు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని, మెడికల్ అన్ఫిట్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కార్మికుల వారసులకు వెంటనే ఉద్యోగ నియామకప్రత్రాలు ఇవ్వాలని,వీకే కోల్ మైన్ లో పర్మినెంట్ ఉద్యోగాలతోనే బొగ్గు వెలికితీత తియ్యాలనీ డిమాండ్ చేశారు, ఎఐటియుసి నిత్యం కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ కార్మికుల హక్కులు సాధించడంలో ముందు ఉంటుందని అన్నారు,అదేవిధంగా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు,కార్యక్రమాల్లో, సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్, సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు,క్రిస్టోఫర్,సామల రాము, పిట్ కార్యదర్శిలు,మధుకృష్ణ, కమల్, సుధీర్,సురేందర్, సౌజన్య,సీనియర్ నాయకులు కత్తర్ల రాములు,రాజాలపూడి సాంబమూర్తి, సురేందర్, సురేష్, మింగిన్ రవి,బండి వెంకటరమణ,కర్రు రమేష్, మెంగన్ రవి, కోటి, మురళి, గుమ్మడి, ఓం ప్రకాశ్, సాయిపవన్, భుక్య రమేష్ ,బండి వెంకటరమణ, బండారి మల్లయ్య, రాజేశ్వరరావు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :