Sunday, 02 August 2026 06:59:18 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి TSUTF రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని.

Date : 08 March 2026 07:09 PM Views : 405

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (08-03-2026) న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం టీచర్స్ భవన్ లో జిల్లా కార్యదర్శి ఎం పద్మారాణి గారి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి చావా దుర్గ భవాని గారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ నేడు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నప్పటికీ ఇంకా మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, సోషల్ మీడియా రూపంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానంగా వారు పనిచేసే ప్రాంతాలలో సరైన సౌకర్యాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళ అక్రమ రవాణా వంటి అనేక దాడులు ఇంకా మహిళలపై జరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయడం కొరకు కఠిన తరమైన చట్టాలను చేయాలని కోరారు. బయట మహిళా చైతన్యం కలిగించేలా కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందించాలని కోరారు. ఈ మహిళా చైతన్య సదస్సులో జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి నీరజ గారు, కొత్తగూడెం ఎంఈఓ మధురవాణి గారు, సుజాతనగర్ ఎంఈఓ లీలా గారు కూడా సదస్సులో పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ మహిళా చైతన్యం పెరగాలని, సమాజంలో మహిళ పాత్ర చాలా గొప్పదని తెలిపారు. ఈ సమస్యలు ప్రభుత్వ వైద్యశాల ఆర్థోపెడిక్ వైద్యులు వైస్ శ్రావణి గారు మాట్లాడుతూ ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి తీసుకోవలసిన ఆహారం వంటి విషయాలను వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతులు హాజరైన అతిథుల చేత అందించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ కృష్ణ, మహిళా ఉపాధ్యాయులు జానకి, వెంకటమ్మ, స్వర్ణలత, పద్మ, వసుంధర, భవాని, తులసి, వాలమ్మ, ఆర్ నాగ జ్యోతి, వెంకటమ్మ,రజియా బేగం,జిల్లా ఉపాధ్యక్షులు ఎం రాజయ్య,జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ డి దాసు, మండల బాధ్యులు రాందాస్, జి నాగేశ్వరావు, లక్ష్మణ్, ఎన్. కిరణ్,రాజారావు, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :