Friday, 18 September 2026 04:24:28 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

భద్రాద్రి గిరిజన విద్యా కళాశాల పూర్వ విద్యార్థుల ఫోరం-కొత్తగూడెం వారి అధ్వర్యంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘన సన్మానం

Date : 03 June 2026 06:09 PM Views : 91

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ గిరిజన పట్టభద్రుల సంక్షేమార్థం 2000 సంవత్సరంలో భద్రాచలం ఐటీడీఏ సంస్థ నెలకొల్పిన గిరిజన విద్యా కళాశాల పూర్వ విద్యార్థులు దాదాపు అందరూ సెటిల్ అయ్యారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న తారాచంద్, మోహన్ రావు, శంకర్, నరేష్ బాబు, నరసింహారావు, శ్రీనివాస్ కబీర్దాస్, నరేంద్రబాబు, మోహన్ లు ఒక ఫోరంగా ఏర్పడి, కొత్తగూడెం స్థాయిలో గత పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎండి.జైనాబ్ 556/600 పాత కొత్తగూడెం, ఎం.ప్రత్యూష 545/600 ఆనందఖని, పి. శ్రీలేఖ 537/600 ఆనంద ఖని విద్యార్థినులను మరియు వారి తల్లిదండ్రులను కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, డిటి అంజద్ పాషా, శంకర్ రావు లు పూర్వ ప్రిన్సిపాల్ గిరిజన బిఈడి కళాశాల డాక్టర్ ప్రభుదయాల్ ఆధ్వర్యంలో నేడు 3.6.2026న ఘనంగా సన్మానించారు నగదు పురస్కారంతో పాటు, ఫైల్స్, రాత పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు అందించి, ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యను కొనసాగించాలని కోరారు. కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, డిటి లు అంజద్ పాషా, శంకర్ రావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అనేక విద్యార్థులకు ప్రేరణగ నిలిచే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రెట్టింపు ఉత్సాహంతో మిమ్ములను విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. పూర్వ రాష్ట్ర పరిధిలో గల అన్ని ఐటిడిఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న శిష్యులకు ఇదే తరహాలో విద్యార్థులను ప్రోత్సహించేలా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించేలా ప్రోత్సాహిస్తునట్లు పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభుదయాల్ వెల్లడించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించడం పట్ల పలువురు గిరిజన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ మిత్రబృందం పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :