తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో అంతర్గత రోడ్లు అభివృద్ధి కొరకు గ్రావెల్ తోలకాలకు అనుమతి ఇప్పించాలని గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి మండల అభివృద్ధి అధికారి పూరేటి అజయ్ ను వినతి పత్రం ద్వారా కోరారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ను కలసి గ్రామంలో గ్రావెల్ అవసరాన్ని వివరించారు. సర్పంచ్ లక్ష్మికుమారి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అధిక వర్షాలతొ గ్రామంలోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, రోడ్లు గుంతలు పడి ప్రజలు, వాహనాలు నడిచే పరిస్థితి లేదని తెలిపారు. నర్సాపురం కాలనీ లోని విధుల్లో ఈ మధ్య కాలంలో రోడ్లపై నీరు నిలిచి బురదమయమై స్థానికులు ఇబ్బంది పడిన విషయాన్ని సర్పంచ్ లక్ష్మి కుమారి ఎంపీడీఓ ద్రుష్టికి తీసుకువెళ్లారు. గ్రామ అవసరాన్ని గుర్తించి రోడ్ల మరమత్తుల కొరకు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి నుండి గ్రావెల్ తోలకాలకు అనుమతి ఇప్పించాలని కోరుతూ మండల అభివృద్ధి అధికారి అజయ్ కు వినతి పత్రం అందచేసారు. సమస్య పట్ల సానుకూలంగా స్పందించిన ఎంపీడీఓ సమస్యను మండల తహశీల్దార్ కు తెలిపి అనుమతులు మంజురైయ్యే విధంగా మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బి హారిక, గ్రామస్తులు లేళ్ల అప్పిరెడ్డి, రామిరెడ్డి, సంఘం చిన్న నాగరాజు, వెలగా తిరపతిరావు, పుప్పాల శ్రీనివాసరావు, లేళ్ల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ