Sunday, 02 August 2026 07:45:25 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సింగరేణి మేనేజ్మెంట్ మైనింగ్ ఉద్యోగాల్లో మాయాజాలం బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 21 September 2024 06:19 PM Views : 545

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో పరీక్షలు నిర్వహించిన ప్రతిసారి తప్పులు జరిగాయని ఆరోపణలు రావడం సర్వసాదరమైందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ విమర్శించారు.సింగరేణి ఇటీవల నిర్వహించిన పరీక్షలో జరిగిన తప్పిదాలపై పరీక్ష రాసిన అభ్యర్థులతో కలిసి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్ తో యువకులకు చేజారిన ఉద్యోగ అవకాశాలు.తప్పులతడగా ప్రశ్న పత్రాల 'కీ'మహిళా రిజర్వేషన్స్ మరియు ,కీ లోని తప్పుల వల్ల మేనేజ్మెంట్ ట్రైనీ ఎగ్జామ్ రాసిన మైనింగ్ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏడు సంవత్సరాల తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ ఉద్యోగల భర్తకి విడుదల చేసిన నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు నష్టమే తప్ప లాభమే లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.సింగరేణి మేనేజ్మెంట్ ట్రైని (మైనింగ్) 1.3.2024 నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఉద్యోగ నియామకాల వ్యవహారం అంతా ఈ డి సి ఐ ఎల్ సంస్థకు అప్పగించిన సింగరేణి యాజమాన్యం.సింగరేణి మేనేజ్మెంట్ ట్రైని (మైనింగ్) పోస్టులకు డి సి ఐ ఎల్ సంస్థ 21.07.2024 రోజున ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించారు.అనతరం 7.9.2024 రోజు ప్రశ్న పత్రాల కీ విడుదల చేసారు అదేవిదంగా రెస్పాన్స్ షీట్ విడుదల చేశాడు.తప్పు ఒప్పులపై ఒక పోర్టల్ ఓపెన్ చేశారు. ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు తప్పు ఒప్పులపై అభ్యంతరాలు తెలియజేశారు.ప్రశ్న పత్రాల కీ తప్పులతడగా ఉందని స్టాండర్డ్ మైనింగ్ బుక్స్ లోని ప్రశ్నలకు కూడా కి లో తప్పులు గా చూపించారని అభ్యర్థులు ఆరోపించారు.10.9.2024 రోజు కొంతమంది నిరుద్యోగులు హైదరాబాదులోని సిఎండి బలరామును కలసి కీ లో తప్పులు ఉన్నాయని సరిచేయాలని విజ్ఞాపన పత్రము అందించారు.ఈ సందర్బంగా సిఎండి బలరాం సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ తో తప్పులను సరిదిద్దిస్తానని అభ్యర్థులకు మాట ఇచ్చారని తెలిపారు.తప్పొప్పులు సరిదిద్దకుండానే 17.9.2024 లిస్టు పెట్టారని అందులో కొన్ని తప్పులు ఉన్నాయని అన్నారు.భారతదేశంలో అతిపెద్ద మైనింగ్ సంస్థ అయినా కోల్ ఇండియా లో కూడా మేనేజ్మెంట్ ట్రైని మైనింగ్ పోస్టులకు మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లేదు.తెలంగాణలోని సింగరేణి సంస్థ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రవేశ పెట్టారు.నిరుద్యోగులైన యువకులకు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు.అమ్మాయిలకు హారిజంటల్ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం వల్ల మొత్తం 139 పోస్టులో గాను మహిళలకు 44 పోస్టు దక్కుతున్నాయి 4,127 మంది ఎగ్జామ్ రాశారు. 159 అమ్మాయిలు ఎగ్జామ్ రాశారని మిగిలిన 95 ఖాళీలకు 4,075 మంది మగ నిరుద్యోగులు పోటీ పడుతున్నారని దీనివల్ల యువకులకు అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఫైనల్ కీ లో కొన్ని తప్పులు దొరల వల్ల నిరుద్యోగులు భారీ ఎత్తున నష్టపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం,డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కలు వెంటనే స్పందించి మరికొన్ని ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో కలిపి ప్రతిభావంతులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలని పోస్టుల సంఖ్యను పెంచాలని పలువురు కోరుతున్నారు ఈకార్యక్రమంలో పరీక్ష రాసిన అభ్యర్థులు వంశీ,సంతోష్,జస్వంత్ రెడ్డి,రాజు,మహేష్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :