తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఏడాది కాలానికి అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికే షన్ విడుదలైంది. ఐటీఐ ఉత్తీర్ణులై నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని, ఇంటర్మీడి యేట్ ఒకేషనల్ కోర్సు చేసిన వారు అర్హులు కాదని అధికారులు వెల్లడించారు. ఈనెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు www.appre nticeshipindia.org 5 www.scclm ines.com/ apprentice ship దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాలు, సర్టిఫికె ట్లతో ఈనెల 10 నుండి ఆయా ఏరియాల ఎం వీటీసీ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. 80 శాతం సీట్లు సంస్థ ఉద్యోగులు,కార్మికుల పిల్ల లు, ప్రభావిత ప్రాంత నిరుద్యోగులకు కేటా యించగా మిగిలిన 20 శాతం తెలంగాణలోని ఆరు జిల్లాలో గల నిరుద్యోగ యువతకు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్లఐటీఐ పూర్తిచేసిన వారికి నెలకు రూ.8,050,ఏడాది కోర్స్ చేసిన వారికి మస్టర్ల ఆధారంగానెలకు రూ.7,700 చెల్లిస్తామని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ