తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికులకు మెరుగైన వైద్యాన్ని అందించడంలో అలసత్వం విడాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులు సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ఆఫీస్ ఎదుట టిబిజికేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్యం కోసం చేపట్టిన నిరసన దీక్షకు వారు హాజరై ప్రసంగించారు..కార్మికుల రక్తంతో సింగరేణి సంస్థ లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ వారికి మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించడానికి వారు తీవ్రంగా తప్పుపట్టారు సింగరేణి కార్మికులు పుడమి తల్లి గర్భంలోకి వెళ్లి అసమాన ధైర్యసహసాలతో ఉగ్గు ఉత్పత్తి చేస్తున్నారని వారు కొనియాడారు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ అడగకముందే అనేక హక్కులు సౌకర్యాలు కల్పించారని వారు గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల లాభాలతో నడుస్తున్న సంస్థలో బీపీ, షుగర్ మందుల గోలీలు లేకపోవడం బాధాకరమని అన్నారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో ప్రస్తుతం అమలులో ఉన్న మెడికల్ రిఫరల్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డు ఇవ్వాలని, సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన సింగరేణి ఉద్యోగులతో పారామెడికల్ పోస్టులను భక్తి చేయాలని అన్నారు.సింగరేణిలో వైద్య సహాయం మెరుగుపరచడానికి 9 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సింగరేణి డైరెక్టర్ పా కె వెంకటేశ్వర్లును ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో మాజీ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సీతామహాలక్ష్మి టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కే సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య అధికార ప్రతినిధి పార్లపల్లి రవి కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు మణుగూరు భూపాలపల్లి రామగుండం డివిజన్ 123 శ్రీరాంపూర్ బెల్లంపల్లి డివిజన్ ఉపాధ్యక్షులు గడప రాజయ్య తుమ్మ శ్రీనివాస్ జాఫర్ హుస్సేన్ నాగలి వెంకటేశ్వర్లు బడితల సమ్మయ్య నాకెళ్లి నాగేల్లి సాంబయ్య ఐలి శ్రీనివాస్ వడ్డేపల్లి శంకర్ లక్ష్మణ్ మల్రాజు శ్రీనివాసరావు i తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ