తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి అభిప్రాయపడ్డారు.జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మంగళవారం గ్రంథాల చైర్మన్ ఆహ్వానం మేరకు గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయం చైర్మన్ పసుపులేటి వీరబాబుతో ఆమె జిల్లాలోని గ్రంథాలయాల పనితీరుపై ముచ్చటించారు అనంతరం గ్రంథాలయంలోని సదుపాయాలను పరిశీలించారు.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రంథాలయంలో క్రమశిక్షణతో చదువుకుంటున్న తీరు చూసి ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించి, గ్రంథాలయ అభివృద్ధి ద్వారా పలువురు ఉద్యోగాలు సాధించిన విషయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూచదువు ఒక్కటే జీవితాన్ని తీర్చిదిద్దగలరని, విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయగలరు” అని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.గ్రంథపాలకురాలు జి. మణిమృదుల పనితీరును ప్రత్యేకంగా అభినందించిన ఆమె, గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కనకాల నవీన్ కుమార్ , సిరిపురపు జస్వంత్ సాయి విద్యార్థిని విద్యార్థులు పాఠకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ