తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నందు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు అయినది. వివరాలలోకి వెళితే సుజాతనగర్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు అనగా లక్ష్మణ్, రాజ్ కుమార్, భాస్కర్ మరియు ఆదినారాయణ అను వ్యక్తులు కొమ్ముగూడెం గ్రామములోని లబ్ధిదారుల వద్ద నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, తమ వద్ద ఉన్న ట్రాలీఆటోలో లోడ్ చేసుకుని కొత్తగూడెం వైపునకు వెళుతూ ఉండగా,నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారి నిక్కిలి వెంకటేశ్వర్లు(R.I), కొమ్ముగూడెం గ్రామంలోని పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద ట్రాలీఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో సుమారు 20 సూపర్ సంచుల లో బియ్యం ఉన్నది. బియ్యం ఎక్కడిదని ప్రశ్నిస్తూ, ఫోటోలు తీస్తూ ఉండగా సదరు పైన పేర్కొన్న వ్యక్తులు ఫిర్యాది యొక్క కాళ్లు, చేతులను గట్టిగా పట్టుకొని, మేలివేసి చేతులతో దాడి చేసి, బియ్యంతో లోడ్ చేసినటువంటి ట్రాలీఆటోతో అక్కడి నుండి పారిపోయినారని, విధులలో భాగంగా రేషన్ బియ్యం లోడ్ తో వెళ్తున్నటువంటి ట్రాలీఆటోను ఆపినందుకుగాను, తనను దుర్భాషలాడి, చేతులు కాళ్లను మేలివేసి, తనను అడ్డగించి, ట్రాలీఆటోను తీసుకొని వెళ్ళి, మరో మారు తమ జోలికి వస్తే చంపుతామని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసిన పైన పేర్కొన్న నలుగురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనెనన్న ఫిర్యాదుపై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట సుబ్బారావు కేసు నమోదు చేసినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ