తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : ఖైరతాబాద్, అంబర్ పేట నియోజకవర్గం పరిదిలో లో డిసిసి అధ్యక్షుడి ఎన్నిక కోసం అధిష్టానం చేపట్టిన “సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ” కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ శక్తిసింహ గోయల్, టీపీసీసీ అబ్జర్వర్స్ మల్లు.రవి,యశష్విని రెడ్డి, నాగ సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగ సీతారాములు మాట్లాడుతు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పార్టీ కోసం ఎంతో కష్టపడి పోరాటాలు చేసిన కార్యకర్తలు నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చి బాధ్యతాయుతమైన పదవులు ఇస్తుందన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. డీసీసీ ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఎవరైనా డీసీసీ పోటీలో ఉండవచ్చని ఈ ప్రక్రియలో ఎలాంటి లాబియింగ్ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి,చంద్రశేఖర్ మరియు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు భారీగా పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ