తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మే 01 (తెలుగు వెలుగు) : దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించడం జరిగింది.కేసులో ప్రధాన ముద్దాయిలు అయిన సోందే ముద్ద రాజు, r/o.లచ్చిగూడెం,సొందే రవి r/o.లచ్చిగూడెంలకు మరియు మృతుడు కారం రామకృష్ణ r/o లచ్చిగూడెం లకు మధ్య భూవివాద నేపథ్యంలో సోందే ముదిరాజు మరియు సోందే రవిలు మరొక ఐదుగురు నిందితులతో కలిసి కారం రామకృష్ణ చంపడానికి కుట్ర పన్ని, తేదీ 10.02.2020 రాత్రి సమయంలో కారం రామకృష్ణ తన ఇంట్లో భార్య పిల్లలతో నిద్రిస్తుండగా కత్తులు,కర్రలతో వెళ్లి కారం రామకృష్ణను హత్య చేసి అడ్డు వెళ్లిన భార్యను తీవ్రంగా గాయపరచడం జరిగింది. మొత్తం 08 మంది నిందితులపై హత్యా నేరం మోపగా,విచారణ సమయంలో ఇద్దరు ముద్దాయిలు మరణించగా ఒక ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేయడమైనది.మిగిలిన ఐదుగురు ప్రధాన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఈ రోజు తీర్పును వెలువరించనైనది.తీర్పు అనంతరం జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు నిందితులను దుమ్ముగూడెం పోలీసులు అదుపులోకి తీసుకొని ఖమ్మం జిల్లా జైలుకు తరలించనైనది. ఇట్టి కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన విచారణ అధికారి అయిన ఇన్స్పెక్టర్ నల్లగట్ల వెంకటేశ్వర్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అయిన రాధా కృష్ణ, పీవిడి లక్ష్మీ మరియు నోడల్ ఆఫీసర్ ఎస్సై ప్రవీణ్, లైజన్ ఆఫీసర్ వీరబాబు మరియు దుమ్ముగూడెం కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ తిరుపతిని ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ