తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 6 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన పావురాల వెంకటేశ్వర్లు (55) అనే వ్యక్తి జూలూరుపాడు ప్రాథమిక పాఠశాల నందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయిందని. వీళ్లకు సంతానం లేరనీ గ్రామస్థుల ద్వారా సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలాన్ని సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ సందర్శించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వారు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ