తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 3 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం లో మూడు కోట్ల 60 లక్షల రూపాయల విలువగల సిసి రోడ్లను బీటీ రోడ్డును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఇందిరామరాజ్యం పనిచేస్తుందని ఒక్కొక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇందిరామరాజ్యంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వరి ధాన్యం ఇంత పండలేదని. తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత వరి ధాన్యాన్ని రైతులు అధికంగా పండిస్తున్నారని పండించిన పంటకు రైతుల నుంచి నేరుగా సహకార సంఘాల ద్వారా ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ బోనస్ 500 రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ , లేళ్ళ వెంకట్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లచ్చు నాయక్. లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ