తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించింది. సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీచేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనసేన పార్టీకి బలమైన పూనాది వేస్తామంటూ జనసేన పార్టీ కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ వేముల కార్తీక్ ప్రకటనలో తెలిపారు .ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ప్రతి జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచారు. త్వరలో ఎన్నికల పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని, గెలుపే లక్ష్యంగా పనిచేసీ జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ