తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు తమ మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి స్నేహబంధం, మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీ రామచంద్ర పాఠశాల 10వ తరగతి (1994–95 బ్యాచ్) విద్యార్థులలో ఒకరైన పంది శివకుమార్ ఆకస్మిక మరణంతో తోటి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.శివకుమార్ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో బ్యాచ్కు చెందిన మిత్రులు కలిసి రూ.1,02,000లను సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. గత కొంతకాలంగా శివకుమార్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం భారీగా ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండటంతో వారి విద్యాభ్యాసం, ఇతర అవసరాలకు ఈ సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గాజుల రాజం బస్తీలోని శివకుమార్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి గడ్డం శాంతి ప్రియ చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, శివకుమార్ లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం అందిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గడ్డం సతీష్ కుమార్, యెర్రా లింగేష్, వేణు, తోట రమేష్, జక్కుల విజయ్, ఆలూరి మురళి, బొబ్బల వెంకట్, అక్తర్, జి. రాంచందర్, మంగ రాంచందర్, అచ్చి నాగరాజు, కంచర్ల సతీష్, పప్పు సురేష్, శివ, ముంతాజ్ తదితర మిత్రులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ