Wednesday, 17 June 2026 03:04:08 PM
# జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్. # అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి - గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని. # 16 వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ. 18 సంవత్సరాల పైపడిన మహిళలందరికీ చీరలు ఇవ్వాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు.

Date : 10 June 2026 07:17 PM Views : 827

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు తమ మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి స్నేహబంధం, మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీ రామచంద్ర పాఠశాల 10వ తరగతి (1994–95 బ్యాచ్) విద్యార్థులలో ఒకరైన పంది శివకుమార్ ఆకస్మిక మరణంతో తోటి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.శివకుమార్ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో బ్యాచ్‌కు చెందిన మిత్రులు కలిసి రూ.1,02,000లను సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. గత కొంతకాలంగా శివకుమార్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం భారీగా ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండటంతో వారి విద్యాభ్యాసం, ఇతర అవసరాలకు ఈ సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గాజుల రాజం బస్తీలోని శివకుమార్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి గడ్డం శాంతి ప్రియ చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, శివకుమార్ లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం అందిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గడ్డం సతీష్ కుమార్, యెర్రా లింగేష్, వేణు, తోట రమేష్, జక్కుల విజయ్, ఆలూరి మురళి, బొబ్బల వెంకట్, అక్తర్, జి. రాంచందర్, మంగ రాంచందర్, అచ్చి నాగరాజు, కంచర్ల సతీష్, పప్పు సురేష్, శివ, ముంతాజ్ తదితర మిత్రులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: