తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండలంలో మంగళవారం పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మాట్లాడుతూ, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులు పండించిన పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతే రాజు అని, రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, మాజీ సొసైటీ చైర్మన్ మండే హనుమంత్ రావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సంబంధిత అధికారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ