Friday, 18 September 2026 12:58:42 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఏపిలోని నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి:కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

Date : 29 June 2025 08:28 PM Views : 559

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిజామాబాద్, జూన్ 29: కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం సందర్బంగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు స్వాగతం పలికారు. పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు- ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క వున్న యటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్రమంత్రిని కోరారు. నిజామాబాద్ లో కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమయింది. ఇదివరకే రాష్ట్రంలోని నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ఆదివారం దాని ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు నిజామాబాద్ ఇంచార్జీ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నిజామాబాద్ కి పసుపు బోర్డు ప్రకటించి, దాని కార్యాలయాన్ని కూడా ప్రారంభించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున కృతజ్ఙతలు తెలిపారు. అలాగే పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పసుపు రైతులు తమ పంటను కనీస మద్ధతు ధరకు అమ్ముకునే విధంగా ధరలలో స్థీరికరణ తేవాలన్నారు. అందుకోసం పసుపు పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించాలని, మార్క్ ఫెడ్, నాఫెడ్ వంటి సంస్థల ద్వారా నేరుగా కొనుగోళ్లను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పసుపు ప్రధానంగా పండే ప్రాంతాలలో డ్రైయింగ్ ప్లాట్‌ఫార్ములు నిర్మాణానికి కేంద్ర నిధులను కేటాయించాలన్నారు. రైతుల వద్దనే పసుపు పాలిషింగ్, గ్రేడింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవడం ద్వారా మార్కెట్ విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అధిక కర్క్యూమిన్ శాతం, వ్యాధి నిరోధకత, ఎగుమతులకు అనుకూలత కలిగిన విత్తన రకాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పసుపు సాగు యాంత్రీకరణ, విలువ ఆధారిత గొలుసు అభివృద్ధిపై ఐసీఏఆర్ మరియు యూజీసీ మద్దతుతో పరిశోధనలకు తోడ్పాటు కల్పించాలని, భౌగోళిక సూచిక (జి ఐ) ఆధారంగా తెలంగాణ పసుపును అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రాండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని అన్నారు. పసుపు పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు డాక్యుమెంటేషన్‌ను సరళీకరించడం, అంతర్జాతీయ వాణిజ్య డెలిగేషన్లు, ఎగ్జిబిషన్లలో రైతుల పాల్గొనడాన్ని ప్రోత్సహించాలన్నారు. పసుపు రైతులకు వారి స్థానిక భాషల్లో సలహాలు అందించే విధంగా మొబైల్ యాప్ లు అభివృద్ధి చేయాలని, విలువ ఆధారిత, సేంద్రీయ సాగు, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, పసుపు సాగులో కార్మిక వ్యయాన్ని తగ్గించేందుకు ఉపాధి హామీ పథకంతో సమన్వయం చేయాలన్నారు. పసుపు రంగ అభివృద్ధి కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పసుపు బోర్డు మరియు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రస్తుత పసుపు సాగు పరిస్థితులపై బేస్‌లైన్ సర్వేను చేపట్టి, వచ్చే ఐదు సంవత్సరాల కోసం ప్రణాళికను రూపొందించాలని అన్నారు. ఏపిలోని నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి. ఏపి పునర్విభజన చట్టం 2014 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క గ్రామాలైన యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు మరియు పురుషోత్తపట్నం లను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్రమంత్రిని లేఖ ద్వారా కోరారు. భద్రాచలం పట్టణం తెలంగాణలో కొనసాగుతుండగా, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం అనే గ్రామ పంచాయతీలు [17 రెవెన్యూ గ్రామాలు] విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని, వీటి వలన అనేక పరిపాలనా, అభివృద్ధి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాచలం పట్టణం మరియు తెలంగాణ ప్రధాన మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతుందని, భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో మరియు రెండు రాష్ట్రాల చెక్‌పోస్టుల వల్ల గిరిజనులు, వాణిజ్య వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఎల్‌డబ్ల్యూ‌ఈ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహణకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, ఎందుకంటే దేవస్థానం భూములు ఏపీ పరిధిలో ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ఆ గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడం అత్యవసరమని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తగిన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :