తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బ్రిడ్జి నిర్మాణం సీతంపేట-రాఘవాపురం గ్రామీణుల చిరకాల వాంఛ రూ.4.75కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నాం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం రూ.34లక్షలతో రెడ్డిపాలెం సిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం రూ.45లక్షలతో నిర్మించిన ఎంఆర్సి భవనం అందుబాటులోకి వచ్చింది ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల చెంతనే ఉంటాం రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో పల్లెల రూపురేఖలు మారుస్తాం: కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సుజాతనగర్ మండలంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు సీతంపేట-రాఘవాపురం గ్రామీణుల చిరకాల వాంఛ అయిన బ్రిడ్జి నిర్మాణాన్ని నెరవేరుస్తున్నామని, బ్రిడ్జి నిర్మాణం ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించడం జరిగిందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సుజాతనగర్ మండల పరిధిలో రూ.5.54 కోట్ల నిధులకు సంబంధించి శనివారం అయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడుతూ రూ.4.75 కోట్ల భారీ అంచనా వ్యయంతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే రూ.34 లక్షలతో రెడ్డిపాలెం సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి విజయవంతంగా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రూ.45 లక్షలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఎంఆర్సి భవనాన్ని కూడా ఈ రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందని, మండలంలో విద్యాసంబంధిత సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయన్నారు. వేపలగడ్డ స్మశానవాటికలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రెండు బోర్లు మంజూరు చేయడం జరిగిందని, వాటి శంకుస్థాపన పూర్తేచేశామన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను మంజూరు చేయించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, తహసీల్దార్ వి వరప్రసాద్, ఎంపిడివో భారతి, ఆరడబ్ల్యూఎస్ ఏఈ గుప్తా, విద్యుత్ ఏఈ జి కిషన్, ఏడిఈ రవికుమార్, సిఐ వెంకటేశ్వర్, పిఆర్ ఏఈ రాజు, డిఈ నాగేందర్, ఎంఈ ఓ లీలా, ఎస్ఐ రమాదేవి, హన్మంతరావు, వ్యవసాయశాఖ అధికారి నర్మద, స్థానిక నాయకులు భూక్యా దస్రు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, ఉపేందర్, భూక్యా శ్రీనివాస్, గుమ్మడిల్లి దర్గయ్య, బొడ్డు కేశవరావు, గారికే ఉపేందర్, నరేష్, ముక్కెర మురళి, దండు సురేష్, లావుడియా గోపి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ