Wednesday, 16 September 2026 11:26:08 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డ్

Date : 15 October 2025 04:06 PM Views : 338

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 148.03 లక్షల మెట్రిక్ టన్నులతో తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో చరిత్ర సృష్టించింది... రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపండి.. ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లతో మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ సచివాలయంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రం ధాన్యం దిగుబడిలో చరిత్రాత్మక రికార్డు సృష్టించిందని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 148.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నమోదైందని, ఇది రైతుల కష్టానికి నిదర్శనమని అన్నారు. అధిక దిగుబడి దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొంటూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, రవాణా వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులు ఎక్కడా నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు వివరాలను వెంటనే నమోదు చేసి, 48 గంటల లోపు రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు. అలాగే ధాన్యం తరలింపు, నిల్వ మరియు మిల్లర్లతో సమన్వయం విషయంలో జిల్లా స్థాయిలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అవసరమైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం అదనపు ఖర్చులకు వెనుకాడరాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు కూడా సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. గడిచిన యాసంగి సీజన్‌లో కలెక్టర్ల సమన్వయంతో సత్ఫలితాలు సాధించామన్నారు. ఈ వానాకాలంలో అధిక దిగుబడి దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “ఎటువంటి సమస్యలు వచ్చినా తక్షణమే నన్ను లేదా పౌర సరఫరాల కమిషనర్‌ను సంప్రదించండి. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం” అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ లతో కలిసి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం కల్పించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సుమారు 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగవచ్చని అంచనా వేశామని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి గదులు, తూకం యంత్రాలు, తడిపరీక్ష పరికరాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు రవాణా వసతులు, నిల్వ గోదాములు, మిల్లర్లతో సమన్వయం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే చెల్లింపులు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ వానాకాలం కొనుగోళ్లు రైతులకు సౌకర్యవంతంగా, పారదర్శకంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల అధికారిని రుక్మిణి మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :