తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోదావరి పుష్కరాల భక్తుల కోసం డార్మెంటరీ నిర్మాణం. భద్రాచలంలో రూ 1.50 కోట్ల వ్యయంతో డార్మెంటరీ నిర్మాణాలకు భూమి పూజ : భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్. వచ్చే ఏడాది 2027 జూన్ - జులై నెలలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం డార్మెంటరీ హాల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.గోదావరి పుష్కరాల కోసం భద్రాద్రి జిల్లాలోని దక్షిణ అయోధ్యగా పేరు ప్రఖ్యాతలు గడిచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంకు విచ్చేసి భక్తుల కొరకు ఈ డార్మెటరీ హాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగాభద్రాచలంలోని అమ్మ సత్రం ప్రాంతం వద్ద దేవాదాయ - ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ 1.50 కోట్ల వ్యయంతో "డార్మెంటరీ జి ప్లస్ వన్ భవన్ " నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించగా ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని మాట్లాడారు.గోదావరి పరివాహక ప్రాంతాలలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు భక్తులు హాజరవుతారని, ముఖ్యంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారని తెలిపారు. భక్తులకు కనీస వసతులను కల్పించే ఉద్దేశం లో భాగంగా వారి వసతి కొరకు దేవాదాయ శాఖ తరపున ఈ డార్మెటరీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పది రోజులకు ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశం ఈ పుష్కర పనులపై నిర్వహిస్తామని అధికారులు ఇది గమనించి పనిచేయాలని తెలిపారు. ఘాట్ నిర్మాణాలను ఇరిగేషన్ శాఖ అధికారులు, త్రాగునీటి సరఫరా ను ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ అధికారులు, రోడ్డు పనులను ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిర్వహించి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.అనంతరం భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రారంభించిన ఘాట్ నిర్మాణాలతో పాటు డార్మెంటరీ నిర్మాణాలను సకాలంలో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఏడు జిల్లాలో గోదావరి పుష్కర పనులు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా భద్రాచలంలో జరుగుతున్న పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా సకాలంలో పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఈ.ఓ దామోదర్, సర్పంచ్ పూనం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత,వార్డు సభ్యులు రమణ,కారం దుర్గారావు,వాణి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ