తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమ్మె నోటీసుపై ఆర్ఎల్సీ సమక్షంలో కీలక చర్చలు జూలై 10కి వాయిదా పడిన తదుపరి చర్చలు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారమే లక్ష్యమని గుర్తింపు సంఘం స్పష్టం. సింగరేణి కార్మికులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు,పెండింగ్ డిమాండ్లు, ఉద్యోగ భద్రత, సంక్షేమ అంశాల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ ఈ నెల 8న యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసిన విషయం తెలిసిందే,కార్మికుల న్యాయమైన 31 డిమాండ్లపై స్పందించిన ఆర్ ఎల్ సి,హైదరాబాద్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ డాక్టర్ శాశ్వతి రథ్ సమక్షంలో గురువారం సుదీర్ఘ చర్చలకు హాజరయ్యారు,ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఈ చర్చల్లో కార్మికుల సమస్యలు, యాజమాన్య వైఖరి, పెండింగ్ అంశాలు,అమలు కాని ఒప్పందాలు,ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక విషయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కార్మికుల తరఫున ఎఐటీయూసీ నాయకులు సమస్యల తీవ్రతను, వాటి ప్రభావాన్ని వివరంగా వివరించగా, యాజమాన్యం తన అభిప్రాయాలను వెల్లడించింది,ఇరుపక్షాల వాదనలు విన్న డిప్యూటీ లేబర్ కమిషనర్, సమస్యలపై మరింత చర్చ అవసరమని భావించి తదుపరి సమావేశాన్ని జూలై 10వ తేదీకి వాయిదా వేశారు,అయితే కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సమ్మె తప్పదని ఎఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు, కార్మికుల హక్కులు,సంక్షేమం, ఉద్యోగ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరింత ఉధృతమైన పోరాటాలకు సిద్ధమవుతామని వారు స్పష్టం చేశారు.ఈ చర్చల్లో ఎఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కే. సారయ్య పాల్గొన్నారు. యాజమాన్యం తరఫున ఏజీఎం (పర్సనల్) అజయ్ కుమార్ చర్చల్లో హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ