Monday, 03 August 2026 09:43:16 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 07 March 2025 06:46 PM Views : 946

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు అర్హులు మాత్రమే మంజూరు అవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, పెండింగ్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, ధరణి దరఖాస్తులపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పరిశీలనకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు మరియు పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేసే దరఖాస్తులు పరిశీలన చేపట్టాలన్నారు. ఎల్ వన్, ఎల్ టు,ఎల్ త్రీ లిస్టులను తయారు చేయాలని ఆదేశించారు. నివేదికలు ఆమోదం పొందిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎల్ వన్ లో అర్హత లేని వారిని పరిశీలించి తొలగించాలని, తొలగించడానికి గల కారణాలను నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కు అర్హత కలిగి ఉండి ఎల్ వన్ జాబితాలో పేరు రాని అర్హుల పేర్లను కూడా నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా ఎల్ టు మరియు ఎల్ త్రీ లో పేర్లు పొందుపరచడానికి గల కారణాలను కూడా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో తండ్రికి పేరు వచ్చి పెళ్లి అయిన కొడుకు దరఖాస్తు చేసిన అర్హత ఉండి జాబితాలో రానటువంటి దరఖాస్తులను కూడా పరిగణలోనికి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తండ్రి పక్క గృహంలో నివసిస్తూ వివాహం అయిన కొడుకు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు అర్హత కలిగి ఉంటే అటువంటి వాటిని కూడా పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. ఎల్ వన్ అంటే శాశ్వత ఎలిజిబిలిటీ లిస్ట్ అని అయినా స్పష్టం చేశారు. ఎంపీడీవోలు పూర్తి బాధ్యతగా వ్యవహరించి అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో జాబితాలో రాకుండా చూడాలని ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :