Saturday, 01 August 2026 11:50:13 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 31 July 2026 07:14 PM Views : 387

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.గోదావరి వరదల నేపథ్యంలో నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష.భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసరాల్లో కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, గోదావరి వరదల నేపథ్యంలో తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని సమీక్ష నిర్వహించారు.గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ పనుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే నిర్మాణ సామగ్రి, యంత్రాలు, విద్యుత్ పరికరాలను భద్రంగా ఉంచడంతో పాటు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, అత్యవసర మార్గాలను అందుబాటులో ఉంచడం, రద్దీ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును మరింత పటిష్ఠం చేయడం, నిర్మాణ పనుల వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయడం వంటి అంశాలపై కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు. వరద పరిస్థితుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు అమలు చర్యల గురించి ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు.భక్తులు, ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ఆలయ అధికారులు, పోలీసు శాఖ, ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్ రావు, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీఐ నాగరాజు, ఆలయ నిర్మాణ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :