తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేద వర్గాల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి.సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం అనన్యం.ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. పేదలు, బడుగు బలహీన వర్గాల గుండెల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) చిరస్మరణీయుడుగా నిలిచారని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం అనన్యమని, చలనచిత్ర పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. రూపాయికి కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల వంటి విప్లవాత్మక పథకాలతో పేదల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు, సమాజ శ్రేయస్సుకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నివాళులర్పిచినవారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ