Sunday, 07 June 2026 07:36:23 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

పేద వర్గాల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 28 May 2026 05:09 PM Views : 22

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేద వర్గాల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి.సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం అనన్యం.ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. పేదలు, బడుగు బలహీన వర్గాల గుండెల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) చిరస్మరణీయుడుగా నిలిచారని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం అనన్యమని, చలనచిత్ర పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. రూపాయికి కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల వంటి విప్లవాత్మక పథకాలతో పేదల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు, సమాజ శ్రేయస్సుకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నివాళులర్పిచినవారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి తదితరులు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :