తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ముందస్తూ అడ్మిషన్లు చేస్తే దాడులు తప్పవు AISF.స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ కి సంబంధం లేకుండా విద్యార్థులకి సర్టిఫికెట్ లు జరిచేయ్యాలి.ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగ నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు SK షాహిద్ వరక అజిత్.ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ముందస్తూ అడ్మిషన్లు చేస్తే దాడులు తప్పవుని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు SK షాహిద్ వరక అజిత్ అన్నారు. సోమవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి(న్యూడల్ )ఆఫీసర్ హెచ్ వెంకటేశ్వర్లుకు ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిబంధనలుకు విరుద్ధంగా నడిపిస్తున ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలపై వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వరక అజిత్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూన్నా కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలకు సంబంధం లేకుండా ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందస్తూ అడ్మిషన్లు చేసిన, విద్యార్ధులకు సర్టిఫికెట్లను ఇవ్వకపోయినా ప్రత్యక్ష ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఇనపల్లి పవన్ సాయి మాణిక్యాల వినయ్ ఉపాధ్యక్షులు సంజయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ