Sunday, 02 August 2026 07:40:37 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జిల్లాలో 1,50,000 ఎకరాలలో మునగ సాగు చేసేలా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 10 October 2024 06:31 PM Views : 625

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా లోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,మహిళా శక్తి యూనిట్లు,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు పీఎం విశ్వకర్మ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏపీవోలు, ఏపిఎంలు మరియు ఈసీఎస్ లతో ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ నర్సరీల లో ఏదో ఒక మొక్కలు కాకుండా వాతావరణానికి మరియు ఆయుర్వేదంగా అనుకూలమైన మొక్కలు దొరంతో , డెకోమో, యూజీనియా , పండానాజ్ , సుబాబులు, వేప, రావి మరియు గానుగ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని కెనాల్ ల రెండు వైపులా జామాయిల్, బాంబు, సుబాబుల్ మరియు యూకలిప్టక్స్ మొక్కలు నాటాలనిఅన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో ప్రభుత్వ ఆఫీసుల్లో, మరియు కాళీ ప్రదేశాల్లో మునగ, ఉసిరి, పనస, మారేడు, మేడి మరియు అల్లనేరేడు మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు తమ పరిధిలోని గృహాలు ప్రభుత్వ ఆఫీసులు పంచాయతీ ప్రదేశాలు బట్టి ఎన్ని మొక్కలు పడతాయో అంచనా వేసుకోవాలని దాని ప్రకారం మొక్కల పెంపకం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 1,63 వేల ఎకరాల్లో వరి సాగు, 85 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు, రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, రైతులకు వీటి సాగుతో పాటు అంతర్ పంటలు మరియు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయిల్ ఫామ్ మరియు అంతర్ పంటలుగా మోరింగా సాగు, మునగ సాగు,చేపల పెంపకం, బోర్ ఉన్న పంట పొలాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని ఆ విధంగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన ఫామ్ పౌండ్, సాగుకు అవసరమైన గుంతలను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఆయిల్ ఫామ్ తోటల్లో కోకో సాగును చేపట్టడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. జిల్లాలో 1,50,000 ఎకరాల్లో మునగ సాగు లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం, అజోల్ల పెంపకం, నాటు కోళ్ల పెంపకం మరియు బాతుల పెంపకం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని, దానికి తగిన అవగాహన కల్పించాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డిఆర్డిఓ ఎన్ రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ పృథ్వి, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :