తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జనవరి 31 (తెలుగు వెలుగు) ఈ రోజు హేమచంద్రాపురం జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్ నందు 15 రోజుల పాటు సాగిన జిల్లా అర్మడ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో జిల్లాఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ముందుగా జిల్లా అర్మడ్ సిబ్బంది నుండి ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.05 ప్లటూన్లతో ఏర్పాటు చేసిన ఈ పరేడ్ నకు అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు ప్లటూన్ కమాండెర్ గా వ్యవహరించారు.పదిహేను రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోర్,ఔట్డోర్,ఫైరింగ్ ప్రాక్టీస్ లలో సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారని ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ ఎస్పీ కి వివరించారు.
అనంతరం ఎస్పీ మట్లాడుతూ పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని,భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.ఈ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని అన్నారు.అద్బుతంగా చేసిన పరేడ్ ను చూస్తే తమ శిక్షణ రోజులు గుర్తొస్తున్నాయని తెలిపారు.అనంతరం అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వెంటనే అట్టి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని తెలియజేశారు.నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందికి వ్యక్తిగత,కుటుంబపరమైన,శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు.ఈ డీ-మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమాన్ని సుందరంగా ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ