Saturday, 18 April 2026 03:39:37 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సాక్షిగా రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ

Date : 14 April 2026 05:56 PM Views : 42

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : Arrive alive-2026 లో భాగంగా రెండవ రోజు రోడ్డు భద్రతా ప్రతిజ్ఞలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్,ఎస్పీ రోహిత్ రాజు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న Arrive-alive-2026 రెండవ రోజున కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ ప్రజలు,ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు రోడ్డు భద్రతా ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్,ఎస్పీ రోహిత్ రాజు లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితోపాటు అడిషనల్ కలెక్టర్ వేణు గోపాల్,అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాచందన,కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత,మేయర్ మూడ్ గణేష్,ఆర్డిఓ మధు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు,పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను సులభంగా నియంత్రించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ బాధ్యతగా మెలగాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ భార్యా,పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇంటి నుండి బయటకు రాగానే హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ఇతర ట్రాఫిక్ నియమాలను కూడా కచ్చితంగా పాటించాలని సూచించారు.విధులలో రోడ్లపై పోలీసులు ఉన్నా లేకపోయినా భాద్యతగా రూల్స్ పాటించి భాద్యత గల పౌరులుగా మెలగాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :