Thursday, 17 September 2026 04:43:30 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

వందేళ్లైనా ప్రజాదరణ తగ్గని ఏకైక పార్టీ సిపిఐ. జనబలంతో కొత్తగూడెం కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 07 January 2026 07:06 PM Views : 265

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గౌతంపూర్, రుద్రంపూర్, రామవరం నుంచి బైపాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ. స్వాతంత్రోద్యమం నుంచి పురుడుపోసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్లైనా ప్రజాదనరాన తగ్గకుండా అజేయంగా నిలిచిందని, ప్రజా ఉద్యమాలతో భారత గడ్డపై మరో వందేళ్లైనా వన్నె తగ్గనివ్వబోమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ శతవసంతాళ ముగింపు సందర్బంగా జనవరి 18న ఖమ్మం నగరంలో జరగనున్న బహిరంగసభ సందర్బంగా చేపట్టిన ప్రచారజాతా బుధవారం చుంచుపల్లి మండలం, గౌతంపూర్ సింగరేణి ప్రాంతానికి చేరుకుంది. ప్రచారజాతా బృందానికి సిపిఐ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. గౌతంపూర్ నుంచి రుద్రంపూర్, రామవరం, కొత్తగూడెం పోస్టాఫీసు మీదుగా చుంచుపల్లి మండలపరిధిలోని విద్యానగర్ వైపాస్ సెంటరుకు చేరుకుంది. ఈ సందర్బంగా ప్రధాన సెంటర్లలో జరిగిన సభల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి, ప్రచారజాతా బృందం నాయకులు ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ వందేళ్లుగా ప్రజలతో మమేకమై ప్రజాపోరాటాల్లో మడమతిప్పబోమని అదే సిపిఐకి బలమన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి అనేక చట్టాలు సిపిఐ పోరాట ఫలితాలేనన్నారు. జిల్లాలో భూపోరాటాలకు నాంది పలికి పేదలకు గూడు కల్పించామని తెలిపారు. పోడు సాగుచేసుకుంటున్న పేదలపక్షాన పోరాడి భూములపై హక్కు కల్పించామన్నారు. రైతు, యువజన, విద్యార్థి, మహిళా ఉద్యమాలతో ప్రజలకు మరింత చేరువయ్యామన్నారు. నియోజకవర్గంలో సిపిఐకి తిరుగులేదని త్వరలో జరగనున్న కొత్తగూడెం కొర్పొరేషన్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగిస్తామని స్పష్టం చేశారు. జాతా సందర్బంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, శేషగిరిరావు, బందెల నర్సయ్య, డాక్టర్ జయశంకర్, తెలంగాతల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదనంతరం రామవరం పట్టణంలో భారీ ర్యాలీ అనంతరం సిపిఐ రాష్ట్ర నేత అమరజీవి బరిగెల సాయిలు , ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నేత మహమ్మద్ దాదా స్తూపానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.కార్యక్రమంలో సిపిఐ నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, సారెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మి కుమారి, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, జి.వీరాస్వామి, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, ఫహీమ్, వంగ వెంకట్, వట్టికొండ మల్లికార్జున్ రావు, భూక్యా శ్రీనివాస్, మాతాంగి లింగయ్య, అన్నెం లక్ష్మీనారాయణ,సంధబోయిన శ్రీనివాస్, మర్రి గోపి, మండల రాజు, తూముల శ్రీనివాస్, పేయ్యాల రంగారావు,బరిగెల భూపేష్, గుత్తుల శ్రీనివాస్, ఎర్రబెల్లి శంకర్, దాట్ల శ్రావణ్, కొచ్చర్ల రాకేష్ కాంత్, సోమయ్య,ఎస్.కె జహీర్, జలీల్, నరేందర్ ,నిమ్మల రాంబాబు, పాటి మోహన్ రావు, వాకపల్లి హరినాథ్, దేవదాసు, సుధనాల రమేష్, కొత్తూరు రవి, సుధాకర్, యూసుఫ్, ధర్మరాజు, సత్యనారాయణ చారి, బండి నర్సింహా, దుర్గ, సర్పంచ్ లు శాంతి శ్రీ, వాడే రాములు, మాజీ సర్పంచ్ గుగులోత్ నగేష్, మాజీ ఉపసర్పంచ్ సింగిరాల రమేష్, అల్లకొండ మోహన్, గోపి తోటకూర శ్రీనివాస్, కూరగాయల శ్రీనివాస్, అజ్మీర బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :