తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు తేదీ 04-05-2026న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి జిల్లా కార్యాలయం నందు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష చేపట్టబడింది. వేసవికాలం దృష్ట్యా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రతి ఆరోగ్య కేంద్రాలలో, ఆరోగ్య కార్యకర్త,ఆశ ల వద్ద మరియు గ్రామపంచాయతీలలో, అంగన్వాడి కేంద్రాలలో, చలివేంద్రాలలో, మరియు జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలలో కచ్చితంగా ఏర్పాటు చేయవలెనని మరియు వడదెబ్బకు సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు నివేదికను జిల్లాకు సమర్పించవలసినదిగా సూచించడం జరిగింది. గర్భిణీ స్త్రీల నమోదు జిల్లాలో 100% చేయాలని, వ్యాధి నిరోధక టీకాలను కూడా 100% లక్ష్యాన్ని సాధించాలని అదేవిధంగా అసంక్రమిత వ్యాధులు అయిన బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ గుర్తింపు కొరకు గ్రామాలలో స్క్రీనింగ్ కచ్చితంగా 100% పూర్తి చేయాలని వాటి నివేదికను ఎప్పటికప్పుడు జిల్లాకు సమర్పించవలనని , మలేరియా కేసులు పెరగకుండా ఇప్పటినుంచి జాగ్రత్తలు తీసుకోవాలని, ఫ్రైడే ఫ్రైడే పాటించాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించడం జరిగినది. .టీబీకేసు లను గ్రామాలలో గుర్తించి వారికి తెమడ పరీక్షలు చేయించి, వారికి చికిత్సను అందజేయాలని సూచించడం జరిగినది.ఇప్పటివరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో 98% లక్ష్యాన్ని సాధించినట్లు తెలియజేయగా, మిగిలిన 2% లక్ష్యాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి 100% సాధించవలసిందిగా వైద్యాధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ భద్రాచలం ,డాక్టర్ సాయి కళ్యాణ్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కొత్తగూడెం, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ప్రసాద్, డా. ప్రతాప్, డా. హరీష్, డా. రాకేష్, డా. రాందాస్, డా. దినేష్ తదితర వైద్యాధికారులు మరియు ఎన్హెచ్ఎం సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ