Thursday, 14 May 2026 12:57:18 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఐ డి ఓ సి జిల్లా కార్యాలయం నందు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది.జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.తుకారామ్ రాథోడ్.

Date : 04 May 2026 08:14 PM Views : 119

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు తేదీ 04-05-2026న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి జిల్లా కార్యాలయం నందు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష చేపట్టబడింది. వేసవికాలం దృష్ట్యా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రతి ఆరోగ్య కేంద్రాలలో, ఆరోగ్య కార్యకర్త,ఆశ ల వద్ద మరియు గ్రామపంచాయతీలలో, అంగన్వాడి కేంద్రాలలో, చలివేంద్రాలలో, మరియు జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలలో కచ్చితంగా ఏర్పాటు చేయవలెనని మరియు వడదెబ్బకు సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు నివేదికను జిల్లాకు సమర్పించవలసినదిగా సూచించడం జరిగింది. గర్భిణీ స్త్రీల నమోదు జిల్లాలో 100% చేయాలని, వ్యాధి నిరోధక టీకాలను కూడా 100% లక్ష్యాన్ని సాధించాలని అదేవిధంగా అసంక్రమిత వ్యాధులు అయిన బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ గుర్తింపు కొరకు గ్రామాలలో స్క్రీనింగ్ కచ్చితంగా 100% పూర్తి చేయాలని వాటి నివేదికను ఎప్పటికప్పుడు జిల్లాకు సమర్పించవలనని , మలేరియా కేసులు పెరగకుండా ఇప్పటినుంచి జాగ్రత్తలు తీసుకోవాలని, ఫ్రైడే ఫ్రైడే పాటించాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించడం జరిగినది. .టీబీకేసు లను గ్రామాలలో గుర్తించి వారికి తెమడ పరీక్షలు చేయించి, వారికి చికిత్సను అందజేయాలని సూచించడం జరిగినది.ఇప్పటివరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో 98% లక్ష్యాన్ని సాధించినట్లు తెలియజేయగా, మిగిలిన 2% లక్ష్యాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి 100% సాధించవలసిందిగా వైద్యాధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ భద్రాచలం ,డాక్టర్ సాయి కళ్యాణ్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కొత్తగూడెం, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ప్రసాద్, డా. ప్రతాప్, డా. హరీష్, డా. రాకేష్, డా. రాందాస్, డా. దినేష్ తదితర వైద్యాధికారులు మరియు ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :