Saturday, 18 April 2026 06:27:27 PM
# ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ రోహిత్ రాజు

Date : 04 February 2026 08:00 PM Views : 110

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ.మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనను విడుదల చేశారు.ఇందులో భాగంగానే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ 08 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు,04 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్,ఇల్లందు,అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 101 పోలింగ్ స్థానాలలోని 288 పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందులో సాధారణ పోలింగ్ కేంద్రాలు 148, సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 125 మరియు 15 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు.మున్సిపాలిటీల వారీగా సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహారిస్తూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఎన్నికల పోటీలో నిలుచున్న అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల వద్ద నుండి అనుమతులు పొందిన తర్వాతనే తమ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.అనుమతులు లేనియెడల ఎన్నికల నియమావళి ప్రకారం అట్టి అభ్యర్థులపై కేసుల నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఓటర్లను ప్రలోభపరిచే విధంగా ఎవరైనా నగదు,మద్యం,ఇతరత్రా సామాగ్రిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,1టౌన్ సీఐ కరుణాకర్,3టౌన్ సీఐ ఇంద్రాసేనారెడ్డి,పాల్వంచ సీఐ సతీష్,ఇల్లందు సీఐ సురేష్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు మరియు ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :