Sunday, 02 August 2026 06:50:17 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సాయి ఎక్సలెంట్ పాఠశాల డిజిటలైజేషన్ చేయడం అభినందనీయం, సీఐ శ్రీ లక్ష్మి

Date : 31 January 2026 02:10 PM Views : 798

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలంలోని సాయి ఎక్సెలెంట్ పాఠశాలలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గాదె శ్రీ లక్ష్మి పాఠశాల డిజిటలైజేషన్ కి సంబంధించి బ్రోచర్ ను శనివారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం అభినందించదగిన విషయం అన్నారు. అదేవిదంగా గత ఏడాది విద్యా సంవత్సరంలో సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 10 నవోదయ సీట్లు, 70 గురుకుల సీట్లు సాధించడం కూడా చాలా సంతోషమన్నారు. విద్యార్థులు విని నేర్చుకోవడం కాకుండా చూసి నేర్చుకుంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది అని మేధావులు, విద్యావంతులు, కార్పొరేట్ విద్యాసంస్థలు డిజిటలైజేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని మన మండలంలో కూడా అదే స్థాయిలో సాయి ఎక్సలెంట్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలకు కూడా మంచి విద్యావంతులుగా చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ఆరేబోయిన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పల్లె, పల్లెకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్దేశంతో 2026 -2027 విద్యా సంవత్సరానికి ముందుకు అడుగులు వేసేదానిలో భాగంగా డిజిటల్ క్లాసులను కార్పొరేట్ లీడ్ అనే సంస్థ తో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు సిఐ గాదె శ్రీ లక్ష్మిని శాలువాకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా సెక్రటరీ, సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ జోహార్ జో, విశ్వశాంతి పాఠశాల కరస్పాండెంట్ నరసింహారావు, సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్లు ఆరెబోయిన నాగలక్ష్మి, జక్కుల శివకుమారి, ఉపాధ్యాయులు నాగరాజు, అనిత, అశోక్, నభీన, దుర్గ భవాని, సత్యవతి, రమేష్, ఉదయభాను, పావని, సరిత, కళ్యాణి, ప్రశాంతి, భార్గవి, నందిని, అరుణ, స్వాతి, త్రివేణి, శిరీష, రిచిత, అరుణ, రమాదేవి, సౌజన్య, త్రివేణి, సునంద, హైమావతి, శాంతమ్మ, భాస్కర్, విద్యార్థుల తల్లిదండ్రులు K.రమేష్, sk. చాంద్, v. చందర్, A. అశోక్, అచ్చయ్య, సమీర్, సునీత తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :