Sunday, 02 August 2026 01:14:00 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

గిరిజన గర్జనతో హోరెత్తిన పాల్వంచ

Date : 18 July 2026 06:10 PM Views : 73

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : ఆదివాసీ హక్కులకై కదంతొక్కిన 'గిరి'జనం గిరిజనుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ మహాసభల్లో పాల్గొన్న సీపీఐ అగ్రనేతలు ప్రారంభమైన టీజీఎస్ రాష్ట్ర మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో తెలంగాణ గిరిజన సమాఖ్య (టీజీఎస్) రాష్ట్ర మహాసభలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల ప్రారంభ సూచికగా స్థానిక లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నుండి పాత ఆర్డీవో కార్యాలయం రోడ్డులోని అమరజీవి సిద్ది వెంకటేశ్వర్లు స్మారక స్తూపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనతో పాల్వంచ పురవీధులన్నీ గిరిజన జయధ్వానాలతో హోరెత్తాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా, భద్రాద్రి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి గిరిజనులు, సీపీఐ, టీజీఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో గిరిజన హక్కుల సాధనకై నేతలు గళమెత్తారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇంచార్జి, సీపీఐ జాతీయ కార్యదర్శి అనీ రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై దిశానిర్దేశం చేశారు. వారితో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు రామ్మూర్తి నాయక్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్రావు, టీజీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూక్య శ్రీనివాస్, సొందే కుటుంబరావు తదితర అగ్రనేతలు ఈ ప్రదర్శనను ముందుండి నడిపించారు. గిరిజనుల ఐక్యతను చాటిచెప్పేలా సాగిన ఈ మహాసభల తొలిరోజు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :