Wednesday, 16 September 2026 03:21:41 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు అందజేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు.

Date : 24 August 2024 06:49 PM Views : 743

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శనివారం ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, పాత్రికేయలు, నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దీనిలో భాగంగానే నూతన రెవెన్యూ చట్టం 20 24 ముసాయిదా బిల్లు రూపొందించిందని కలెక్టర్ చెప్పారు . నూతన చట్టం రూపకల్పనలో రైతులను, ప్రజలను మేధావులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వర్క్ షాప్ లో నిర్వహించాలని ఆదేశించిందని కలెక్టర్ తెలిపారు. బిల్లు అంశాలు,రైతుల భూ రికార్డులు పకడ్బందీగా ఉండాలని ఉద్దేశంతో ముసాయిదా బిల్లుపై మేధావులు విద్యావేత్తలు, రెవెన్యూ అధికారులు, రిటైర్డ్ అధికారులు, భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు, రైతులు, రైతు సంఘం నాయకులు, తమ సూచనలు అందజేయాలని కలెక్టర్ కోరారు.

రైతులు మాట్లాడుతూ చట్ట మార్పు చేసేటప్పుడు భూ సర్వే నిర్వహించాలని, భూమిపై ఉన్న రైతులు మాత్రమే నమోదు చేయాలని తెలిపారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, పాత చట్టాలను మార్చి, కొత్త చట్టాలలో ప్రతి సంవత్సరం పహానీలలో నమోదు ఉండాలని, శిస్తు వసూలు మళ్లీ పెట్టాలని, కాస్త కాలం ఉండాలని,ఆర్వోఆర్ ను సవరించాలని, పొజిషన్ కాలం ఉండాలని కబ్జా ఉన్న రైతులకే పట్టా ఇవ్వాలని, ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కొత్త చట్టం గురించి తెలపాలని, గ్రామాల వారిగా ఉన్న సర్వే నెంబర్లలో భూమి ఎక్కువగా ఉంటుందని సరిచేయాలని, భూమి అమ్మిన వారి పేర్లను తొలగించాలని, ధరణి పోర్టల్ వల్ల రైతులకు చాలా నష్టం జరిగిందని దాన్ని తీసేయాలని, ఈ చట్టం ద్వారా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదని, భూములను మ్యాపింగ్ చేయాలని, రైతుబంధు తీసుకుంటున్న రైతుల భూములను పరిశీలించాలన్నారు.ఆధార్ నమోదు తో పాటు మరేదైనా కార్డు కంపల్సరిగా తీసుకోవాలని, కొత్త చట్టంలో అప్పిల్ ఉండాలని, పొజిషన్ కాలం కూడా ఉండాలని, ప్రభుత్వం చట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకొని చట్టం చేయడం చాలా సంతోషంగా ఉందని, సాదా బైనామా చేసే అధికారం డివిజన్ అధికారులకు ఇవ్వాలని, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ లో సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలని, జమాబందీ జరగాలని, ఏ రైతు అప్పిలైన జిల్లా లెవల్లో అయిపోవాలని, గ్రామాల వారీగా రికార్డులు చేపట్టాలని, భూ సమస్యల అప్పిలేటదారిటీ జిల్లా స్థాయిలో ఉండేలా చూడాలని, ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి నియమించాలని వారు కోరారు. ఇంకా ఈ సమావేశానికి రానివారు, నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ror2024- rev@telangana.gov.in వెబ్ సైట్ లో అప్లోడ్ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు మధు, దామోదర్ బార్ అసోసియేషన్ సభ్యులు సోమేశ్, తాసీల్దార్లు, న్యాయవాదులు, రెవెన్యూ సిబ్బంది, అరిటైర్డ్ అధికారులు, రైతు సంఘం నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :