Thursday, 17 September 2026 05:31:53 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎస్ ఆర్ కే టి స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాలు.

Date : 19 July 2025 06:58 PM Views : 647

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జూలై 20 ( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేధర బస్తి ఎస్ ఆర్ కె టి స్కూల్ లో ఘనంగా ఆషాడ బోనాల. సంబరాలు నిర్వహించడం జరిగింది .చిన్నతనం నుండే విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఉద్దేశంతో మేదర బస్తి ఎస్సార్ కే టి స్కూల్లో చిన్నారులచే దుర్గమ్మ తల్లికి ఆషాడ మాస బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎల్కేజీ ,యూకేజీ మొదలు ప్రీమియం తరగతుల విద్యార్థులు తాము ఆరోగ్యంగా ఉండాలి,చదువులు బాగా రావాలని అమ్మ వారికి బోనమెత్తారు.మట్టి కుండల్లో నైవేద్యాన్ని ఉంచి, పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించారు .ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో అమ్మలను గన్న అమ్మ శ్రీ దుర్గమ్మవారికి బోనాలను సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ హాజరయ్యారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు డైరెక్టర్లు ఘనంగా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిని బొకేతో స్వాగతం పలికి బోనాలు ఎత్తుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు స్కూల్ యజమానులతొ కలిసి బోనాలు సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ లలో బోనాల జాతర అత్యంత పవిత్రంగా జరుగుతుందని అదేవిధంగా ఆషాడ మాసం ఊరురా జరుపుకునే సాంప్రదాయ పండుగ బోనాల పండుగ అని అన్నారు. కొత్తగూడెంలో ఎస్ ఆర్ కె టి స్కూల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు అని పేర్కొన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని అలాంటి రైతుకు పంటలు బాగా పండి సంతోషంగా జీవించేలా చల్లగా చూడమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి వేషాధారణలో చిన్నారి శాన్వి సహోజ్, నృత్య ప్రదర్శనలో పోతురాజులు ఆకర్షణీయంగా నిలిచారు. నర్సరీ నుండి మొదలుకొని పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు టీచర్లు అందరూ కలిసి సంతోషంగా నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాపు సీతాలక్ష్మిని ఎస్ ఆర్ కే టి ప్రధానోపాధ్యారాలు డైరెక్టర్లు ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేధార్ బస్తి ఎస్సార్ కే టి స్కూల్ డైరెక్టర్స్ కోట్ల రామరాజు, గుగులోత్ హతీరామ్, ప్రిన్సిపాల్ స్వర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :