Thursday, 14 May 2026 02:20:52 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఎస్ ఆర్ కే టి స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాలు.

Date : 19 July 2025 06:58 PM Views : 560

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జూలై 20 ( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేధర బస్తి ఎస్ ఆర్ కె టి స్కూల్ లో ఘనంగా ఆషాడ బోనాల. సంబరాలు నిర్వహించడం జరిగింది .చిన్నతనం నుండే విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఉద్దేశంతో మేదర బస్తి ఎస్సార్ కే టి స్కూల్లో చిన్నారులచే దుర్గమ్మ తల్లికి ఆషాడ మాస బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎల్కేజీ ,యూకేజీ మొదలు ప్రీమియం తరగతుల విద్యార్థులు తాము ఆరోగ్యంగా ఉండాలి,చదువులు బాగా రావాలని అమ్మ వారికి బోనమెత్తారు.మట్టి కుండల్లో నైవేద్యాన్ని ఉంచి, పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించారు .ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో అమ్మలను గన్న అమ్మ శ్రీ దుర్గమ్మవారికి బోనాలను సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ హాజరయ్యారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు డైరెక్టర్లు ఘనంగా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిని బొకేతో స్వాగతం పలికి బోనాలు ఎత్తుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు స్కూల్ యజమానులతొ కలిసి బోనాలు సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ లలో బోనాల జాతర అత్యంత పవిత్రంగా జరుగుతుందని అదేవిధంగా ఆషాడ మాసం ఊరురా జరుపుకునే సాంప్రదాయ పండుగ బోనాల పండుగ అని అన్నారు. కొత్తగూడెంలో ఎస్ ఆర్ కె టి స్కూల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు అని పేర్కొన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని అలాంటి రైతుకు పంటలు బాగా పండి సంతోషంగా జీవించేలా చల్లగా చూడమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి వేషాధారణలో చిన్నారి శాన్వి సహోజ్, నృత్య ప్రదర్శనలో పోతురాజులు ఆకర్షణీయంగా నిలిచారు. నర్సరీ నుండి మొదలుకొని పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు టీచర్లు అందరూ కలిసి సంతోషంగా నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాపు సీతాలక్ష్మిని ఎస్ ఆర్ కే టి ప్రధానోపాధ్యారాలు డైరెక్టర్లు ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేధార్ బస్తి ఎస్సార్ కే టి స్కూల్ డైరెక్టర్స్ కోట్ల రామరాజు, గుగులోత్ హతీరామ్, ప్రిన్సిపాల్ స్వర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :