Monday, 03 August 2026 04:56:46 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమం : కేంద్ర నోడల్ అధికారి ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్.

Date : 06 August 2024 08:43 PM Views : 535

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం ఐడిఓసి సమావేశం మందిరంలో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , డాక్టర్ శ్రీనివాస్ విట్టల్ టెక్నికల్ ఆఫీసర్ రాష్ట్ర జల శక్తి అభియాన్ , జిల్లా అధికారు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ముందుగా జిల్లా కలెక్టర్ జలశక్తి అభియాన్ కార్యక్రమం లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు తీసుకుంటున్న చర్యలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటెషెన్ ద్వారా వ్యసాయ, ఉద్యనవన, ఇరిగేషన్, గ్రామీణభివృద్ధి, తాగునిరు, భూగర్భజలాలు, మహిళసంఘాలు తదితర అంశాలపై కేంద్ర సభ్యులకు వివరించారు. అనంతరం కేంద్ర సభ్యులు మాట్లాడుతూ క్యాచ్ థ రైన్ వెన్ ఇట్ ఫాల్స్ అంశం పై కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు . జిల్లాలో ఉన్న నీటి వనరుల ట్యాంకుల సరిహద్దులో ఎలాంటి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో సామూహిక ఇంకుడు గుంతలు నిర్మాణం, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం, అటవీ పునరుద్ధరణ వంటివి చేపట్టాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి జలశక్తి అభియాన్ క్యాచ్ థ రైన్ క్యాంపెయిన్ చేపట్టామని అన్నారు. గత 6 సంవత్సరాల కాలంలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతుందని, జిల్లాలో కురుస్తున్న వర్షపు నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షపు నీరు వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో అవగాహన పెంచుతున్నామని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విక్రమాల అమలు చేస్తున్నామని తెలిపారు. వీటిలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలు, వాటర్ షెడ్ల అభివృద్ధి, అడవుల పెంపకం, నీటి మేనేజ్మెంట్ చర్యలు విస్తృతంగా చేపట్టామని అన్నారు. మహిళా సంఘాలు, , గ్రామసభల ద్వారా గ్రామాలలో నీటి సంరక్షణ పనులను గుర్తించామని పేర్కొన్నారు. అనంతరం గ్రామీణభవృధి సంస్థ అద్వర్యం లో ఏర్పాటు చేసిన జలశక్తి అభియాన్ కేంద్రానికి కేంద్ర సభ్యులు పరిశీలించారు. కేంద్రం లో వున్నా రిజిస్టర్లు తనిఖీ చేసారు.జిల్లా లో వున్న నీటివనరులు, నీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిన్నరసాని ప్రాజెక్ట్ ను పరిశీ లించారు. ఈ సందర్బంగా ఆయన పాజెక్ట్ విస్తీర్ణం, నీటి నిల్వ, పాజెక్ట్ ద్వారా నీటి సరఫరా ఏ ప్రాంతాలకు జరుగుతుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ మోటర్ హౌస్ ని పరిశీలించారు.

అనంతరం ములకలపల్లి మండలం లోని అంకిత మండల మహిళా సమాఖ్య కార్యాలము లో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర సభ్యులు స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఆహార పదార్దాలు మరియు వస్తువులను పరిశీలించారు. అనంతరం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ముందుగా మహిళా సంఘ సభ్యులతో ఈ సందర్బంగా కేంద్ర సభ్యులు మాట్లాడుతూ నీటి పొదుపు అనేది మహిళల ద్వారానే సాధ్యం అవుతుందని తెలిపారు. నీటి పొదుపు చెయ్యడనికి ఎం జాగర్తలు మరియు చర్యలు తీసుకుంటారు అని అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఇంటిలో వర్షపు నీటికి ఇంకుడుగుంతలు ఏర్పాటు చెయ్యాలి.ఇంత మంది మీహిళలతో సమావేశం లో పాల్గొనటం నా కుటుంబసభ్యుయులతో మాట్లాడుతున్నట్టు వున్నది అని తెలిపారు.అనంతరం కార్యాలయం లో మొక్కలు నాటారు. మండల పరిషత్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి సురనారాయణ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అర్జున్ రావు, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :