తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జూలూరుపాడు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోకాంప్లెక్స్ HM టి లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో కాంప్లెక్స్ స్థాయి లో రాష్ట్ర మహిళ ఉపాధ్యాయినిల రోజు ఉత్సవంగా నిర్వహించారు అందరూ, మహిళా ఉపాధ్యాయినులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి లక్ష్మి నరసయ్య అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమానికి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. కుల వ్యవస్థకు, పితస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని తెలిపారు అనంతరం పాపకొల్లు కాంప్లెక్స్ మహిళా ఉపాధ్యాయుని లను ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి సన్మాన గ్రహీతలు శ్రీమతి నిమ్మగడ్డ ఉమా, సూర పనిని శాంతకుమారి అరుణకుమారి పి. ఉమామహేశ్వరి బానోత్ సునీత . కేలోత్ లలిత వి .శకుంతల జిల్లా ఉపేంద్రమ్మ కాంప్లెక్స్ ఉపాధ్యాయురాలు శ్రీమతి జి ఉమామహేశ్వరి శ్రీమతి కె వెంకట నరసమ్మ శ్రీమతి పాయం సరిత శ్రీమతి ఎస్.కె ఇంతియాజ్ బేగం లను సన్మానించడం జరిగినది
Admin
తెలుగు వెలుగు టీవీ