తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్19(తెలుగువెలుగు) జూలూరుపాడు మండలం దండుమిట్టతండా గ్రామం వద్ద ఆటో బోల్తా, కొత్తగూడెం వైపు వెల్లతున్న లారీని అదే రూట్లో వెళ్తున్న ఆటో, స్పీడుగా లారీ ని ఓవర్ టెక్ చెయ్యబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే లోయలోకి దూసుకుపోయి ఆటో బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది ,ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి కి తీవ్ర గాయాలు కాగా మరిఒక వ్యక్తి కి స్వల్ప గాయాలు అయ్యాయి, ఆసమయంలో రోడ్ పై వెళ్తున్న వారు చూసి వెంటనే గాయాలు అయినా వారిని బయటకు తీసి స్థానికుల సహాయంతో 108 అబులెన్స్ వాహనంలో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు,ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారిగా సమాచారం..
Admin
తెలుగు వెలుగు టీవీ