Thursday, 02 July 2026 04:24:31 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 26 June 2026 08:54 PM Views : 87

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటర్ల జాబితా పక్కాగా ఉంటేనే ప్రజాస్వామ్య బలోపేతం.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం.కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణపై దృష్టి పెట్టాలి.క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాలను నిరంతరం పరిశీలించాలి.ప్రజాస్వామ్య వ్యవస్థలో బిఎల్ఏల పాత్రే అత్యంత కీలకం.బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. ఓటర్ల జాబితా పక్కాగా ఉంటేనే ప్రజాస్వామ్య బలోపేతం సాధ్యమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని సిపిఐ మండల కార్యాలయం 'రజబ్ అలీ భవన్'లో శుక్రవారం చుంచుపల్లి మండల స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఏ)ల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అయన బిఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ, క్రమబద్ధీకరణపై, బిఎల్ఏల విధులపై అవగాహనా పెంచుకోవాలని, పోలింగ్ కేంద్రాల పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను గుర్తించి కొత్త ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. మరణించిన వారి పేర్లు, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలన జరపాలని కోరారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. సర్ ప్రక్రియలో పార్టీ బిఎల్ఏ అప్రమత్తంగా ఉండాలని, బిఎల్వో లకు సహకరిస్తూ సమగ్ర ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు సహకరించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బిఎల్ఏల పాత్ర అత్యంత కీలకమైనదని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తమ విధులను పూర్తి బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. సమావేశంలో మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు జి వీరాస్వామి, నాయకులు మహేష్, భూక్యా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :